ఒకప్పుడు బంజారా జాతీయులు అధికంగా ఉండే ప్రాంతమిది. కాలక్రమేణా అత్యధిక ధనికులుండే నివాసంగా మారింది. బంజారాహిల్స్లో 1930 దాకా, అంతక్రితం వరకు బంజారా జాతీయులు ఇక్కడున్న కొండ ప్రాంతాల్లో అధికంగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని బంజారాహిల్స్గా పిలుస్తున్నారు. నేటికీ అదేపేరుతో ప్రాచుర్యం పొందింది. సినిమా తారలు, రాజకీయవేత్తలు ఉండే ఖరీదైన ప్రదేశం. తాజ్ బంజారా హోటల్, జి వి కే వన్ మాల్ ఇక్కడ ఉన్నాయి. స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, మాన్స్ టర్ ఇండియా కూడా ఇక్కడే ఉన్నాయి. అబీడ్సు లోని సిటీ సెంటర్ కన్నా ఈ ప్రదేశంలో ఉన్న సిటీ సెంటర్ కే ఎక్కువ గుర్తింపు వచ్చింది.